పృథ్వీ వాయిస్ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపుతున్నాం
- ఆడియో వ్యవహారం నా దృష్టికి వచ్చింది - వైవీ సుబ్బారెడ్డి స్వామి వారి పవిత్రతను కాపాడే విధంగా ఎస్వీబీసీ పనిచేస్తోంది
సీఎం జగన్ ఆదేశాల మేరకు ఎస్వీబీసీ చైర్మన్ పదవికి పృథ్వీరాజ్ను రాజీనామా చేయాలని కోరినట్టు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. HMTV తో వైవీ సుబ్బారెడ్డి ప్రత్యేకంగా మాట్లాడారు. ఆడియో వ్యవహారంపై విచారణ కమిటీ వేశామని సాయంత్రం రిపోర్ట్ వచ్చిందని తెలిపారు. ఈ విషయం సీఎంకు తెలపడంతో రాజీనామా చేయాలని పృథ్వీని కోరినట్టు చెప్పారు. వాయిస్ ను ఫోరెన్సిక్ లాబ్కు పంపుతామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు.