తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం

Update: 2019-10-15 08:00 GMT

తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మారేడుమిల్లి-చింతూరు ఘాట్‌రోడ్డులో ప్రైవేటు బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే ఈ ప్రమాదం ఎలా చోటుచేసుకుంది..? డ్రైవర్ తప్పిదమా..? లేకుంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా..? అనేది తెలియాల్సి ఉంది. మారేడుమిల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

Tags:    

Similar News