శుక్రవారం హైపవర్ కమిటీ మరోసారి భేటీ కాబోతుంది. సీఎం జగన్ కబిటీ సమావేశమై కమిటీలో చర్చించిన అంశాలను వివరించనున్నారు. ఇప్పటికే మూడుసార్లు భేటీ అయిన హైపవర్ కమిటీ బీసీజీ, జీఎన్ రావు కమిటీల నివేదికలపై చర్చించింది. అభివృద్ధి, పాలన వికేంద్రీకరణ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతుల సమస్యలు, సచివాలయం ఉద్యోగుల తరలింపు, సీఆర్డీఏ రద్దుతో పాటు పలు అంశాలపై కమిటీ చర్చించింది. వచ్చే సోమవారం సీఎం జగన్కు కమిటీ తుది నివేదికను అందించే అవకాశం ఉంది. సోమవారం ఉదయం జరిగే మంత్రి వర్గ భేటీలో హైవపర్ కమిటీ నివేదికలపై ప్రధాన చర్చ జరగనుంది.