ఘనంగా గురుపూజోత్సవం

విశాఖపట్నం జిల్లలో భీమిలి నియోజక వర్గం లో చిన ఉప్పడ ఏమ్పీయూపీ స్కూల్లో గురుపూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు సత్కారాలు చేశారు.

Update: 2019-09-05 13:09 GMT

ఉపాధ్యాయుడే రేపటి తరానికి దిక్సూచి అని రిటైర్డ్ హెడ్మాస్టర్ ఎస్.ప్రకాశం అన్నారు. విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గంలో చిన ఉప్పడ ఏమ్పీయూపీ స్కూలులో గురుపూజా దినోత్సవం సందర్భంగా స్కూలు టీచర్లు, విద్యార్థులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రేపటి సమాజాన్ని ఒక క్రమ పద్ధతిలో ఉంచగలిగిన శక్తి ఉపాధ్యాయుడికి మాత్రమె ఉంటుందన్నారు. ప్రతి విద్యార్ధి రేపటి తరానికి ప్రతినిధి అనే సత్యాన్ని ఉపాధ్యాయులు మరువకూడదని చెప్పారు. విద్యార్థుల సర్వతో ముఖాభివ్రుద్ధికి చక్కని మార్గం వేసే బాధ్యత ఉపాధ్యాయునిదే అని వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అయన ఆశీస్సులు అందచేశారు. అనంతరం స్కూలులో చక్కని విద్య అందిస్తున్న ఉపాధ్యాయులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో స్కూలు ప్రధానోపాధ్యాయుడు ఎస్.నర్సింగరావు, ఉపాధ్యాయులు ఈశ్వర్ రెడ్డి ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 





 





రామ్ గోపాల్ వర్మ టీచర్లపై చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తారా?


Tags:    

Similar News