వైసీపీ మంత్రులు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. పేదలకు సన్నబియ్యం గురించి అడిగితే.. ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడమని అంటున్నారన్నారు. చంద్రబాబు దీక్షను అపహాస్యంచేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు ఇసుకను బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారని, ఇసుక అక్రమ రవాణాలో మంత్రుల హస్తం ఉందని దేవినేని ఉమా ఆరోపించారు.