House Site Pattas: సుప్రీం కోర్టులో ఏపీ సర్కార్‌కు చుక్కెదురు

Update: 2020-08-17 08:28 GMT

house site pattas: సుప్రీం కోర్టులో ఏపీ సర్కార్‌కు మరోసారి చుక్కెదురైంది. అమరావతి ఇళ్ల స్థలాల పంపిణీ, ఆర్‌ 5 జోన్‌పై హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఆర్5 జోన్ ను ప్రకటిస్తూ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ 355ను రాష్ట్ర హైకోర్టు ఇటీవల సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీనితో పాటు పలు అంశాలపై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం మొత్తం 5 పిటిషన్లను దాఖలు చేయగా వాటన్నింటినీ సుప్రీంకోర్టు కొట్టేసింది. హైకోర్టు విచారణ సరిగానే జరిగిందని సీజేఐ బొబ్డే అభిప్రాయపడ్డారు. హైకోర్టులో కేసు తుది విచారణ ముగించాలని సుప్రీంకోర్టు సూచించింది.


Tags:    

Similar News