సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. ప్రభుత్వ కార్యాలయాలకు వేసిన పార్టీ రంగులు తొలగించాలని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పిటిషన్పై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం నాలుగువారాల్లో రంగులు తొలగించాలని ఆదేశించింది. కార్యాలయాలకు వేసిన రంగులు వైసీపీ జెండా రంగులు కాదని వాదనలు వినిపించగా.. నాలుగు వారాల్లో వేసిన రంగులు తొలగించక పోతే కోర్టు ధిక్కరణగా పరిగణించాల్సి ఉంటుందని ఆదేశించింది. ప్రభుత్వ కార్యాలయాల రంగులపై రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో 623 రద్దు చేసింది.