ఏపీలో రెబల్ ఎమ్మెల్యేల అనర్హతపై ఉత్కంఠ.. నేడు స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం

AP News: 8 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై నిన్న స్పీకర్ విచారణ

Update: 2024-01-30 05:25 GMT

ఏపీలో రెబల్ ఎమ్మెల్యేల అనర్హతపై ఉత్కంఠ.. నేడు స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం

AP News: ఏపీలో రెబల్ ఎమ్మెల్యేల అనర్హతపై ఉత్కంఠ నెలకొంది. ఇవాళ ఈ అంశంపై స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 8 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై నిన్న స్పీకర్ విచారించారు. నిన్న ఐదుగురు రెబల్ ఎమ్మెల్యేలు స్పీకర్ ఎదుట వ్యక్తిగత విచారణకు హాజరయ్యారు. స్పీకర్ నోటీసులపై రెబల్ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు చుక్కెదురయ్యింది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఇవాళ స్పీకర్ తమ్మినేని పిటిషన్లపై కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.

Tags:    

Similar News