ఏపీ రాజధాని విషయంలో మరో కీలక పరిణామం.. అభివృద్ధి ప్రాజెక్టును రద్దు చేసుకున్న సింగపూర్

Update: 2019-11-12 06:11 GMT

ఏపీ రాజధాని విషయంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమరావతి స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును రద్దు చేసుకున్నట్లు సింగపూర్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఏపీ ప్రభుత్వంతో అసెండాస్, సింగ్ బ్రిడ్జీ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు వివరించింది. పరస్పర అంగీకారంతోనే ప్రాజెక్టును రద్దు చేసుకున్నట్లు ప్రకటనలో చెప్పింది. ఏపీ సర్కారు ప్రతిపాదించిన స్టార్టప్ ఏరియా అభివృద్ధికి ఆసక్తి చూపించడం లేదని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.  

Tags:    

Similar News