ఘోర రోడ్డు ప్రమాదం: ఏడుగురు మృతి, పలువురికి గాయాలు

Update: 2020-06-17 09:22 GMT

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని జగ్గయ్యపేట మండలం వేదాద్రి వద్ద ట్రాక్టర్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. పలువురు ఈ ఘటనలో గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతులు ఖమ్మం జిల్లా మధిర వాసులుగా గుర్తించారు. వీరంతా వేదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దర్శనానికి వచ్చారు. ఆలయం సమీపంలోనే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో 30 మందికిపైగా ప్రయాణిస్తున్నట్లు సమాచారం.

Tags:    

Similar News