పోలవరం పై రెండురోజుల్లోగా సమాధానం ఇవ్వండి.. ఏపీకి కేంద్రం లేఖ!

పోలవరం ప్రాజెక్ట్ టెండర్ల విషయంలో స్పందించకుండా ఉన్నందుకు ఏపీ ప్రభుత్వంపై కేంద్ర జలశక్తి శాఖ మరోసారి సీరియస్ గా స్పందించింది.

Update: 2019-09-10 03:45 GMT

పోలవరం ప్రాజెక్ట్ టెండర్ల విషయంలో స్పందించకుండా ఉన్నందుకు ఏపీ ప్రభుత్వంపై కేంద్ర జలశక్తి శాఖ మరోసారి సీరియస్ గా స్పందించింది. రెండు వారాల క్రియ్తం పోలవరం ప్రాజెక్ట్ పరిణామాలపై నివేదిక కోరుతూ కేంద్ర జలశక్తి శాఖ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ లేఖపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. పోలవరం రివర్స్ టెండరింగ్ పై ప్రాజెక్ట్ అథారిటీ అభ్యంతరం చెబుతున్నా ఏపీ ప్రభుత్వం దూకుడుగా ముందుకు వెళుతోంది. దీనితో కేంద్రం ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోరింది. కానీ, ఈ అంశంపై కేంద్రానికి ఎటువంటి సమాధానమూ ఇవ్వలేదు ఏపీ ప్రభుత్వం. దాంతో తాజాగా మరో లేఖను ఏపీ ప్రభుత్వానికి కేంద్రం పంపించింది.

కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఓపీ సిన్హా తాజాగా రాసిన లేఖలో.. పోలవరం విషయంలో వెంటనే స్పందించాలని కోరారు. గత లేఖలో చెప్పిన విధంగా వెంటనే వివరణ ఇవ్వాలని చెప్పారు. రెండురోజుల్లో సమాధానం చెప్పాలని లేఖలో పేర్కొన్నారు.


Tags:    

Similar News