చినదొడ్డిగల్లులో ఎస్సీ కాలనీ నందు సచివాలయం నిర్మించాలని ఎమ్మెల్యేకి వినతి
మండలం లోని చినదొడ్డిగల్లు గ్రామంలో ఎంపిటిసి -2పరిధిలో సచివాలయ నిర్మాణం కోరుతూ ఎంపిటీసి2 సభ్యుడు దమ్ము అప్పారావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ని అడ్డురోడ్ లోని ఆయన కార్యాలయం వద్ద శుక్రవారం కలిసి వినతి పత్రం అందించారు.
నక్కపల్లి : మండలం లోని చినదొడ్డిగల్లు గ్రామంలో ఎంపిటిసి -2పరిధిలో సచివాలయ నిర్మాణం కోరుతూ ఎంపిటీసి2 సభ్యుడు దమ్ము అప్పారావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ని అడ్డురోడ్ లోని ఆయన కార్యాలయం వద్ద శుక్రవారం కలిసి వినతి పత్రం అందించారు. గ్రామానికి చెందిన సుమారు500మంది దళితులు , మహిళలు , వెనుక బడిన వర్గాలకు చెందిన వారు ఎమ్మెల్యేని కలిసి, సచివాలయ నిర్మాణ ఆవశ్యకతను వివరించారు.
ఆ గ్రామంలో రెండు సచివాలయాలు నిర్మించుటకు ప్రతిపాదనలు జరుగగా , ఇప్పటికే ఒక దానిని నిర్మించుటకు నిర్ణయం జరిగింది. కాగా రెండవ సచివాలయ భవనాన్ని ఎంపిటీసి 2 పరిధిలోని ఎస్సీ కాలనీ నందు నిర్మించాలని వీరంతా కోరారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారని అంబేద్కర్ యూత్ ఫోర్స్ నియోజక వర్గ కమాండర్ కుంచే మధు తెలిపారు. అలాగే నియోజకవర్గంలోని పలు దళిత సంఘాలు వీరికి మద్దతు తెలుపుతున్నాయని మధు తెలిపారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యేకి ఎంపిటిసి అప్పారావు ధన్యవాదాలు తెలిపారు.