పెనుగొండ: చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోయే మన యువముఖ్యమంత్రి వైయస్. జగన్మోహన్ రెడ్డి నూతన పరిపాలన వికేంద్రీకరణ అని వైసీపీ మహిళా నాయకురాలు నిమ్మల సరోజినీదేవి అన్నారు. అంతేకాక, "అమ్మ ఒడి", "ఎస్సీ, ఎస్టీ బిల్" ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజన పథకంలోని నూతన మెనూ ప్రకటించిన శుభ సందర్భంగా పెనుగొండ పంచాయితీ జంక్షన్ లో జరిగిన సంబరాలులో వైసీపీ మహిళా నాయకురాలు నిమ్మల సరోజినీ దేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సరోజినీ దేవి మాట్లాడుతూ చట్టబద్ధంగా తీర్మానాల ద్వారా పాలన వికేంద్రీకరణ జరిగిందని చంద్రబాబు ఇకనైనా పద్ధతి మార్చుకుని ఉత్తరాంధ్ర రాయలసీమలకు మద్దతుగా నిలవాలన్నారు.