దేశ రాజధానిలో జనసేన అధినేత పవన్కల్యాణ్ పర్యటిస్తున్నారు. ఢిల్లీలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాను కలిశారు. ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో పవన్కల్యాణ్ హస్తిన టూర్ ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే జేపీ నడ్డాతో రైతుల ఆందోళన, రాజధాని అంశాన్ని చర్చించినట్లు తెలుస్తోంది.
ఈ భేటీలో పవన్ వెంట జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. ముఖ్యంగా ఈ సమావేశంలో ఏపీలో నెలకొన్న పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తోంది. అయితే బీజేపీ పెద్దల్ని కలవక ముందు పవన్ పలువురు ఆర్ఎస్ఎస నేతల్ని కూడా కలిసినట్లు వార్తలు వినిపించాయి. వారితో పవన్ రహస్యంగా భేటీ అయినట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం పవన్ హైదరాబాద్ బయలుదేరారు.