Bobbili: జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు

ఈ రోజు చైతన్య ఈ-టెక్నో స్కూల్ లో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

Update: 2020-02-28 11:22 GMT
ఏ.పీ.టీ.ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జె.సి.రాజు, డాక్టర్.రామ్ నరేష్,

బొబ్బిలి: ఈ రోజు చైతన్య ఈ-టెక్నో స్కూల్ లో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ వైద్యులు డాక్టర్.రామ్ నరేష్ అథిదులుగా హాజరైన ఏ.పీ.టీ.ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జె.సి.రాజు విద్యార్థులు రూపొందించిన శాస్త్రీయ ఆవిష్కరణలను పరిశీలించారు.

ఈ సందర్భంగా రామ్ నరేష్ మాట్లాడుతూ... విద్యార్థులు శాస్త్రీయ దృక్పధాన్ని అభిరుచిని పెంపొందించుకోవాలన్నారు. మీలో నుండి మరొక సీవీ రామన్ తయారు కావాలన్నారు. స్కూల్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.


Tags:    

Similar News