సీఎం జగన్‌తో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సమావేశం

Update: 2019-11-26 11:21 GMT
వల్లభనేని వంశీ

ఇటీవల టీడీపీకి రాజీనామా చేసి పార్టీ నుంచి బయటకొచ్చిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. మంత్రి కొడాలి నానితో కలిసి జగన్ నివాసానికి వెళ్ళిన వంశీ ముఖ్యమంత్రితో దాదాపు అరగంట పాటు సమావేశయ్యారు.

మరి కొన్ని రోజుల్లో ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో వంశీ ముఖ్యమంత్రిని కల్వడం, సుదీర్ఘంగా సమాలోచనలు జరపడం చర్చనీయాంశమైంది. కొడాలి నానితో కలిసి జగన్‌తో భేటీ అయిన వంశీ ఈ వారంలోనే వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News