మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు

Update: 2020-01-18 07:32 GMT

లంబసింగి: విశాఖ మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. చింతపల్లిలో శుక్రవారం ఉదయం 8.0 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో రోజంతా చలి వాతావరణం కొనసాగుతోంది.

ఉదయం పది గంటల వరకు దట్టంగా మంచు పడుతోంది. లంబసింగి, తాజంగి, చెరువులవెనం ప్రాంతాలు సందర్శకులతో కిటకిటలాడాయి. మంచు అందాలను ఆస్వాదిస్తూ పలువురు సందర్శకులు సెల్ఫీలు దిగారు.

Tags:    

Similar News