పల్టీకొట్టిన ఆర్టీసీ బస్సు

Update: 2019-11-22 05:10 GMT
ఆర్టీసీ బస్సు

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. అచ్చంపేట జంక్షన్ దగ్గర ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టంది. రాజోలు నుంచి విశాఖ వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు,ఆర్టీసీ అధికారులు క్షతగాత్రులను కాకినాడ జీజీహెచ్ కు తరలించారు. ప్రమాదంలో గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. 

Tags:    

Similar News