వైఎస్ సన్నిహిత మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

Update: 2020-05-08 06:21 GMT

కడప జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే పేర్ల శివారెడ్డి కన్నుమూశారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ప్రొద్దుటూరులోని ఓ ప్రయివేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. కమలాపురం ఎమ్మెల్యే గా 1978-83 మధ్యకాలంలో స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికయ్యారు. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉండేవారు. ప్రొద్దుటూరులో సాయంత్రం 4గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు.



Tags:    

Similar News