కాకినాడ ఘటనలో గాయపడిన కార్యకర్తలను పవన్ కల్యాణ్ పరామర్శించిన అనంతరం జనసేన పార్టీ కీలక ప్రకటన చేసింది. జనవరి 16న కనుమ రోజు విజయవాడలో బీజేపీ, జనసేన మధ్య ముఖ్యమైన సమావేశం జరనుందని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. గేట్వే హోటల్లో ఉదయం 11 గంటలకు సమావేశం ఉంటుందని.. ఆ తర్వాత రెండు పార్టీలు ఉమ్మడి మీడియా సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. అమరావతిపై ఆందోళనలు జరుగుతున్న వేళ ఇరు పార్టీలు సమావేశం కానుండడం ఏపీలో హాట్ టాపిక్గా మారింది.