తోట చంద్రయ్య హత్య కేసులో పురోగతి.. పోలీసుల అదుపులో 8 మంది..

Guntur: గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో తోట చంద్రయ్య హత్య కేసును 24 గంటల్లోనే ఛేదించినట్లు గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ తెలిపారు.

Update: 2022-01-14 10:34 GMT

తోట చంద్రయ్య హత్య కేసులో పురోగతి.. పోలీసుల అదుపులో 8 మంది.. 

Guntur: గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో తోట చంద్రయ్య హత్య కేసును 24 గంటల్లోనే ఛేదించినట్లు గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ తెలిపారు. ప్రధాన నిందితుడు చింతా శివరామయ్యకు, చంద్రయ్యకు మధ్య పాత కక్షలే ఘర్షణకు దారి తీశాయన్నారు. సిమెంటు రోడ్డు విషయంలో ఇద్దరి మధ్యా గొడవలు జరిగాయని తనను చంపేందుకు చంద్రయ్య ప్రయత్నిస్తున్నాడన్న సమాచారంతో శివరామయ్యే చంద్రయ్యను హత్య చేశాడని, బైక్ పై వెళుతుండగా కర్రలు, కత్తులతో దాడి చేశారని గున్నీ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి 8 మంది నిందితులను అరెస్టు చేసినట్లు రూరల్‌ ఎస్పీ విశాల్‌ గున్నీ వెల్లడించారు.

Tags:    

Similar News