వల్లభనేని వంశీ రాజీనామాతో కృష్ణాజిల్లా గన్నవరం టీడీపీలో కలకలం మొదలైంది. వంశీ బాటలో తామంతా అంటూ నాలుగు మండలాల నేతలు, కార్యకర్తలు రాజీనామాలకు సిద్ధమయ్యారు. వంశీ ఏ పార్టిలోకి వెళ్లినా తామంతా ఆయన వెంటే ఉంటామని అంటున్నారు. వంశీ రాజీనామా చేయమని తమకు చెప్పలేదని ఆయన రాజీమానా చేశారు కాబట్టే, తాము కూడా టీడీపీలో ఉండమని అంటున్నారు.