ప్రకాశం జిల్లా గిద్దలూరులో 9మంది స్మగ్లర్లను ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆన్లైన్లో పులిచర్మాన్ని 60 లక్షలకు విక్రయిస్తుండగా అరెస్ట్ చేశారు. వారి నుంచి పులిచర్మం, 17 పులిగోర్లు, బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
స్మగ్లర్లకు విదేశీయులతో సంబంధాలున్నట్లు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. నిందితుల సమాచారంతో విదేశీయుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.