నిన్న కడపలో సీఎం పర్యటన బందోబస్తుకు వెళ్లిన AP SDRF సిబ్బందికి ఫుడ్ పాయిజన్
*తిరుగు ప్రయాణంలో అస్వస్థతకు గురైన SDRF సిబ్బంది
AP SDRF: నిన్న కడపలో సీఎం పర్యటన బందోబస్తుకు వెళ్లిన AP SDRF సిబ్బందికి ఫుడ్ పాయిజన్కు గురయ్యారు. అనంతపురం నుండి 35 మంది AP SDRF సిబ్బంది సీఎం జగన్ పర్యటన బందోబస్తుకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కర్నూలుకు వెళ్తూ SDRF సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు. దీంతో వీరిని తాడిపత్రి ఆస్పత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు.