ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలుపై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయంటూ మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. ఇంగ్లీష్ మీడియం వద్దంటున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. జమిలి ఎన్నికలు వస్తాయని, జగన్ జైలుకు వెళ్తారని కొందరు కలలు కంటున్నారని, అవేమీ నెరవేరవని అవంతి అన్నారు.