టీడీపీకి రాజీనామా చేసిన అవినాష్‌.. కాసేపట్లో వైసీపీలోకి..

Update: 2019-11-14 10:15 GMT

దేవినేని అవినాష్ కాసేపట్లో వైసీపీలో చేరనున్నారు. ఇవాళ టీడీపీకి గుడ్ బై చెప్పిన దేవినేని అవినాష్‌ తెలుగు యువత అధ్యక్ష పదవితో పాటు ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. దీనికి సంబంధించిన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర కార్యాలయానికి పంపించారు. అవినాశ్‌తో పాటు సీనియర్ నేత కడియాల బచ్చిబాబు కూడా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఆయన కూడా తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర కార్యాలయానికి పంపించారు.

Tags:    

Similar News