Coronavirus Updates in AP: ఏపీలో మరో 1155 కరోనా పాజిటివ్‌ కేసులు

Update: 2020-07-07 09:33 GMT

Coronavirus Updates in AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 1155 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 16,238 శాంపిల్స్‌ని పరీక్షించగా 1155 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. 762 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొవిడ్‌ కారణంగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కరోనాతో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. కర్నూలులో నలుగురు, అనంతపూర్‌లో ముగ్గురు, చిత్తూరులో ఇద్దరు, విశాఖపట్టణంలో ఇద్దరు, ప్రకాశంలో ఒకరు, పశ్చిమ గోదావరిలో మరొకరు చనిపోయినట్టు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కరోనా హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు 18,520. ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 252. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 8014కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 10,254 మంది చికిత్స పొందుతున్నారు.



 



Tags:    

Similar News