Coronavirus Updates in AP: ఏపీలో మరో 1051 కరోనా పాజిటివ్‌ కేసులు

Update: 2020-07-08 08:12 GMT
Representational Image

Coronavirus Updates in AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 1051 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 27,643 శాంపిల్స్‌ని పరీక్షించగా 1051 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. 1332 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొవిడ్‌ కారణంగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కరోనాతో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. కర్నూలులో ముగ్గురు, అనంతపూర్‌లో ఇద్దరు, కృష్ణాలో ఇద్దరు, పశ్చిమ గోదావరిలో ఇద్దరు, చిత్తూరులో ఒకరు, విశాఖ పట్టణంలో ఒకరు చనిపోయినట్టు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కరోనా హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు 19,571. ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 264. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 9346కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 9,961 మంది చికిత్స పొందుతున్నారు.



 



Tags:    

Similar News