Coronavirus updates in AndhraPradesh: ఏపీలో కరోనా విజృంభణ

Coronavirus updates in AndhraPradesh: ఏపీలో కరోనా మహమ్మారి విలయతాండవం ఆడుతుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,927 కరోనా కేసులు న‌మోదైన‌ట్టు వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.

Update: 2020-08-25 14:51 GMT

Coronavirus updates in AndhraPradesh

Coronavirus updates in AndhraPradesh: ఏపీలో కరోనా మహమ్మారి విలయతాండవం ఆడుతుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,927 కరోనా కేసులు న‌మోదైన‌ట్టు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసుల‌తో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,71,639కి చేరింది. కరోనాను జయించి  2,78,247 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఏపీలో మొత్తం 89,932 యాక్టివ్ కేసులున్నాయి.

అలాగే మరో 92 మంది కరోనాతో మరణించారు. చిత్తూరులో 16 మంది, అనంతపూర్‌లో 11, కడపలో 10, ప్రకాశంలో 10, తూర్పుగోదావరి ఎనిమిది మంది, గుంటూరులో ఆరుగురు, నెల్లూరులో ఆరుగురు, శ్రీకాకుళంలో ఆరుగురు, విశాఖపట్టణంలో ఆరుగురు, కృష్ణాలో నలుగురు, విజయనగరంలో ఒకరు చనిపోయారు. 

వీటిలో మ‌ర‌ణాల సంఖ్య 3,460 కు చేరింది. తూర్పుగోదావరి జిల్లాలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. ఆ ఒక్క జిల్లాలోనే 52,039 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇక కరోనా టెస్టుల విషయానికొస్తే.. గడిచిన 24 గంటల్లో 64,351 కరోనా శాంపిల్స్‌ను పరీక్షించారు. ఇప్పటి వరకు 33,56,852మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఏపీ వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.


Tags:    

Similar News