Coronavirus updates in Telangana: తెలంగాణలో కొత్తగా 2,579 పాజిటివ్ కేసులు..

Coronavirus updates in Telangana: తెలంగాణలో కొత్తగా 2,579 పాజిటివ్ కేసులు..
x
Highlights

Coronavirus updates in Telangana: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది.

Coronavirus updates in Telangana: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. నిన్న(ఆదివారం) రాత్రి 8 గంటల వరకు కొత్తగా 2,579 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 09 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,08,670కి చేరింది. మృతుల సంఖ్య 770కి పెరిగింది. దీంతో కరోనా వైరస్ నుంచి కోలుకోని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 84,163కి చేరింది. ప్రస్తుతం 23,737 మంది చికిత్స పొందుతున్నారు. శనివారం ఒక్క రోజే 1,752 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఒక్క రోజే 53,933 టెస్టులు చేయగా 2,579 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 10,21,054 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ ప‌రిధిలో 295, రంగారెడ్డిలో 186, ఖమ్మం లో 161 కేసులు నమోదయ్యాయి.. రాష్ట్రంలో రికవరీల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది ప్రస్తుతం రికవరీ రేట్ 77.44గా ఉంది. దేశంలో 75.276గా రికవరీ రేట్. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 320 కేంద్రాల్లో ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు చేస్తున్నట్లు.. ప్రస్తుతం తెలంగాణలో మరణాల రేటు 0.70 శాతంగా ప్రభుత్వం చెప్పింది. దేశంలో అది 1.85 శాతంగా ఉందని తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories