Andhra News: రెండో దశ పశువుల అంబులెన్సులు ప్రారంభించిన సీఎం జగన్
Andhra News: వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవ పథకం కింద అంబులెన్సులు ప్రారంభం
Andhra News: మూగ జీవాలకు మెరుగైన వైద్య సేవలందించే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవలను సీఎం జగన్ జెండా ఊపి ప్రారంభించారు. ఇప్పటికే నియోజకవర్గానికి ఒకటి చొప్పున 129కోట్ల7 లక్షల రూపాయలతో 175 వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. తాజాగా వీటికి అదనంగా 111కోట్ల 62లక్షల రూపాయలతో రూపొందిన మరో 165 వాహనాలు ఇవాళ నుంచి రోడ్డెక్కాయి. ఈ సేవలతో పశువుల ఆరోగ్యానికి జగన్ ప్రభుత్వం భద్రత భరోసా కల్పిస్తోంది.