కలెక్టర్లతో హైలెవల్ రివ్యూ.. పళ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలంటున్న సీఎం జగన్
ఇసుక కొరతపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇసుక కొరతపై విపక్షాలు పెద్దఎత్తున ఆరోపణలు చేస్తుండటంతో ఇసుక తవ్వకాలు, సరఫరాపై కలెక్టర్లతో హైలెవల్ రివ్యూ చేపట్టారు. విపక్షాల ఆరోపణలను తిప్పికొట్టిన జగన్ పళ్లున్న చెట్టు మీదే రాళ్లేస్తారంటూ కౌంటర్ ఇచ్చారు. టీడీపీ హయాంలో ఇసుకను దోచేశారన్న జగన్మోహన్ రెడ్డి ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపడంతోనే తమ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.