ఏసీబీ పనితీరుపై ఏపీ సీఎం జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి నిరోదక శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించిన జగన్ ఆశించిన రీతిలో పనితీరు కనబర్చడం లేదని అసహనం వ్యక్తం చేశారు. అధికారులు మరింత చురుగ్గా పనిచేయాలని క్రియాశీలకంగా అంకిత భావంతో పనిచేయాలని సూచించారు.
సిబ్బందికి అలసత్వం ఉండకూడదని హెచ్చరించారు. అవినీతి నిరోదానికి నెంబర్ 14400 కాల్ సెంటర్ ఏర్పాటు వెనక మంచి ఉద్దేశ్యముందని సీఎం తెలిపారు. ప్రజలెవ్వరూ అవినీతి బారిన పడకూడదని లంచాలు చెల్లించే పరిస్థితి ఎక్కడా కనిపించకూడదన్నారు. మరో నెల రోజుల్లో సమీక్ష నిర్వహిస్తామని అప్పట్లోగా మార్పు కనిపించాలని సీఎం జగన్ స్పష్టం చేశారు.