సీఎం జగన్తో మెగాస్టార్ చిరంజీవి భేటీ ముగిసింది. జగన్ను మర్యాదపూర్వకంగా చిరంజీవి దంపతులు కలిశారు. ఈ సందర్భంగా జగన్ దంపతులు సాదరంగా ఆహ్వానించారు. సైరా సినిమాను చూడాలని సీఎం జగన్ ను చిరు కోరారు. దీనిపై స్పందించిన జగన్ సైరాను అద్భుతంగా తీశారని విన్నానని అభినందిచారు. చిరంజీవి దంపతులకు జగన్ నివాసంలో విందు ఏర్పాటు చేశారు. జగన్ సతీమణి భారతికి చిరంజీవి సతీమణి సురేఖ చీరను బహుకరించారు.