Tirumala: శ్రీవారి సేవలో అల్లు స్నేహారెడ్డి, ప్రగతి, నందినీరెడ్డి
Tirumala: శ్రీవారి తీర్థప్రసాదాలు అందించిన ఆలయాధికారులు
Tirumala: తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి, సినీ దర్శకురాలు నందినిరెడ్డి, ప్రముఖ నటి ప్రగతి వేర్వేరుగా శ్రీవారిసేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందించారు. శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి.. పట్టువస్త్రంతో సత్కరించారు ఆలయాధికారులు.