ప్రాణాలు తీసిన సెల్ఫీ.. పిల్లలకు సెల్‌ఫోన్ ఇవ్వకండి అంటూ తల్లి రోదన..

Update: 2019-11-11 06:23 GMT

సెల్ఫీ సరదా ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని ప్రాణాలను బలిగొంది. గుంటూరు జిల్లా నకరికల్లు మండలం కండ్లగుంట బ్రాంచి కెనాల్ వద్దకు తోటి మిత్రులతో కలిసి ధనలక్ష్మి అనే ఇంజినీరింగ్ విద్యార్థిని వెళ్లింది. కెనాల్ వద్ద సెల్ఫీ దిగుతుండగా ధనలక్ష్మితో పాటు మరో విద్యార్థిని కాల్వలో పడిపోయారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టిన స్థానికులు ఒక విద్యార్థిని రక్షించారు. నీటిలో మునిగి ధనలక్ష్మి చనిపోయింది. మృతురాలి కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోధించారు. ధనలక్ష్మీ తల్లి ఏడుస్తున్న తీరు అక్కడున్న వారి గుండెల్ని కలిచివేసింది. సెల్ఫీ నా బిడ్డ ప్రాణం తీసింది పిల్లలకు సెల్ ఫోన్ ఇవ్వకండి అంటూ ఆ తల్లి రోదిస్తున్న తీరు స్థానికుల చేత కూడా కంటతడి పెట్టించింది.

Full View

Tags:    

Similar News