బీజేపీ ఆధ్వర్యంలో విజయవాడలో ఇసుక సత్యాగ్రహం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, పురంధేశ్వరి, మాణిక్యాలరావు పాల్గొన్నారు. వరదల వల్ల ఇసుక తీయలేకపోతున్నామనడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమన్నారు కన్నా లక్ష్మీనారాయణ.
ఆరు నెలల్లోనే ప్రభుత్వం ప్రజల వ్యతిరేకతను కూడగట్టుకుందన్నారు పురంధేశ్వరి. ఇసుక కొరత ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శించారు. రాష్ట్రాభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్న పురంధేశ్వరి భవన నిర్మాణ కార్మికులకు అండగా ఉంటామన్నారు.