ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియపై ఆమె సోదరుడు విఖ్యాత్ రెడ్డి కోర్టులో కేసు వేశారు. హైదరాబాద్ శివార్లలో ఒక భూమికి సంబంధించిన డాక్యుమెంట్లలో తాను మైనర్ గా ఉన్నప్పుడు వేలి ముద్రలు తీసుకున్నారని, ఇప్పుడు ఆ భూమిలో తనకు వాటా కావాలని రంగారెడ్డి కోర్టులో విఖ్యాత్ రెడ్డి కేసు వేశారు.