బంధుత్వాలు మన స్టేటస్ ని చూసి వస్తాయి కావచ్చు. కానీ ఎలాంటి సంబంధం లేకున్నా కష్టాల్లో నేనున్నాను అని వచ్చేది మాత్రం ఒక్క స్నేహితుడు మాత్రమే.. అందుకు ఈ ఘటన నిదర్శనం అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే నెల్లూరు జిల్లా అనంతసాగరానికి చెందిన షేక్ ఖాజావలీ అనే వ్యక్తి సెంట్రింగ్ పనులు చేసుకుంటూ కుటుంబానికి అండగా నిలుస్తున్నాడు. అయితే ఖాజావలికి అనుకోకుండా ప్రాణాంతకమైన బోన్ మ్యారో వ్యాధి ఉందని డాక్టర్లు పరీక్షలు చెప్పడంతో మంచన పడ్డాడు.
వైద్యానికి 25లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పుకొచ్చారు. దీనితో అంత స్తోమత లేకపోవడంతో ఏమి చేయలేని పరిస్థితిలో ఆ కుటుంబం ఉంది. కానీ చిన్నప్పటి నుండి తనతో చదువుకున్న తన స్నేహితుడు ఇప్పుడు ఇలా మంచన పడి ఉండడంతో అతని స్నేహితులు ఖాజావలిని కాపాడుకునేందుకు జోలె పట్టారు. అతడి వైద్యానికి సరిపడే డబ్బు కోసం ఇంటింటికి తిరుగుతూ సహాయం చేయాలనీ కోరుతున్నారు. ఇంకా కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ప్రస్తుతం ఖాజావలికి తమిళనాడులోని వేలూరు ఆస్పత్రిలో చేర్చి వైద్యం అందిస్తున్నారు.