రీయంబర్స్ మెంట్ సొమ్ము విద్యార్థుల ఖాతాలకే

Update: 2019-11-30 14:32 GMT

ఏపీ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తులను దృష్టిలో పెట్టుకుని నూతన పథకాలను అమలు చేయనుంది. ఈ పథకాల ద్వారా విద్యార్థులకు ఆర్థికంగా  లాభం చేకూరనుంది. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాల అమలుపై ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, కాపు, మైనారిటీ, దివ్యాంగులకు అందిస్తున్న పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ లను ఐటీఐ, పాలిటెక్నిక్ , డిగ్రీ, పీజీ ఉన్నత స్థాయి విద్యను అభ్యసించే వారికి కూడా వర్తింపజేయనుంది.

జగనన్న వసతి దీవెన పథకం కింద ఐటీఐ విద్యార్థులకు ఏడాదికి రూ.10వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15వేలు, డిగ్రీ విద్యార్థులకు ఏడాదికి రూ.20వేలు చెల్లించనున్నారు. ఈ పథకాలు వర్తించాలంటే కళాశాలలో కనీసం 75శాతం మేర హాజరు శాతం ఉండాలని తెలిపారు. ఈ పథకం కేవలం ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుకునే వాళ్లకు మాత్రమే కాకుండా ప్రయివేటు, డీమ్డ్ వర్సిటీల్లో సీట్లు పొందిన వారికి కూడా ఈ పథకం అమలవుతుందని తెలిపారు. అంతేకాక దూరవిద్య, కరస్పాండెంట్ ,మేనేజ్ మెంట్ కోటాలో సీట్లు పొందిన వారు కూడా దీనికి అర్హులని తెలిపారు.

ఫీజు రీయంబర్స్ మెంట్ మొత్తాన్ని నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాలలోనే జమ చేయాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంతే కాక వైఎస్ఆర్ నవశకం పేరిట విద్యార్థులకు ఫీజు రియంబర్స్ మెంట్ కార్డులను జారీ చేయనుంది ఏపీ ప్రభుత్వం. ఈ పథకాల అమలుకు కలెక్టర్లు భాధ్యత వహిస్తారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.




Tags:    

Similar News