ఎమ్మెల్యే పిన్నెల్లి కోసం కొనసాగుతున్న గాలింపు

Pinnelli Ramakrishna Reddy: వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

Update: 2024-05-23 04:44 GMT

ఎమ్మెల్యే పిన్నెల్లి కోసం కొనసాగుతున్న గాలింపు

Pinnelli Ramakrishna Reddy: వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో ఆయనపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈసీ ఆదేశాల మేరకు పిన్నెల్లిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పిన్నెల్లిని అరెస్ట్ చేసేందుకు రంగంలోకి దిగిన పల్నాడు పోలీసులు..ఏపీ, తెలంగాణలో ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇక దేశం విడిచిపోతారన్న నేపథ్యంలో లుకౌట్ నోటీసులు జారీ చేశారు.

ఇక మాచర్ల ఘటన నేపథ్యంలో పోలింగ్ సిబ్బందిపై ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో పీవో‌ను సస్పెండ్ చేశారు. పిన్నెల్లి EVM ధ్వంసం సమయంలో అడ్డుకునే ప్రయత్నంలో విఫలమయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ చర్యలు తీసుకున్నారు. సాయంత్రంలోగా వివరణ ఇవ్వాలంటూ పీవోను ఈసీ ఆదేశించింది.

ఈవీఎం ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ.. టీడీపీ చలో మాచర్లకు పిలుపునిచ్చింది. అయితే చలో మాచర్లకు అనుమతి లేదంటున్నారు పోలీసులు. టీడీపీ పిలుపు నేపథ్యంలో మాచర్ల పట్టణంలో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. 144 సెక్షన్ అమల్లో ఉందంటున్న పోలీసులు.. ఇప్పటికే పలువురు టీడీపీ నేతలకు నోటీసులు జారీ చేసి.. బ్రహ్మరెడ్డి, నక్కా ఆనందబాబు, జీవీని హౌస్‌ అరెస్ట్‌ చేశారు. జూలకంటి నివాసం వద్ద భారీగా మోహరించిన పోలీసులు.. మాచర్లకు వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.

Tags:    

Similar News