పట్టాభికి బెయిల్ మంజూరు.. పోలీసులు ఓవరాక్షన్ తగ్గించుకోవాలన్న హైకోర్ట్

AP High Court: టీడీపీ నేత పట్టాభికి బెయిల్‌ మంజూరైంది.

Update: 2021-10-23 10:45 GMT

పట్టాభికి బెయిల్.. పోలీసులను ఓవరాక్షన్ తగ్గించుకోవాలన్న న్యాయమూర్తి

AP High Court: టీడీపీ నేత పట్టాభికి బెయిల్‌ మంజూరైంది. బెయిల్‌ను హైకోర్టు మంజూరు చేసింది. వాదనలు, ప్రతివాదనలు విన్న న్యాయమూర్తి పోలీసులను ఓవరాక్షన్‌ తగ్గించుకోవాలని సూచించారు. 41 సీఆర్పీసీ సమాధానం రాకుండానే ఎందుకు అరెస్ట్‌ చేశారంటూ ధర్మాసనం పోలీసులను ప్రశ్నించింది. 3 CMM మేజిస్ట్రేట్‌ ఎలా రిమాండ్‌ ఇచ్చిందో చెప్పాలని హైకోర్టు వివరణ కోరింది. ప్రస్తుతం పట్టాభి రాజమండ్రి కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. పట్టాభికి బెయిల్ రావడంపై టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News