Sangam Dairy: ధూళిపాళ్ల నరేంద్రకు బెయిల్ మంజూరు

Sangam Dairy: ధూళిపాళ్ల నరేంద్రకు బెయిల్‌ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు.

Update: 2021-05-24 05:43 GMT

ధూళిపాళ్ల నరేంద్ర (ఇమేజ్ సోర్స్  ది హన్స్ ఇండియా )

Sangam Dairy: ధూళిపాళ్ల నరేంద్రకు బెయిల్‌ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. సంగం డైరీ కేసులో ధూళిపాళ్లతో పాటు ఎండీ గోపాలకృష్ణకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరయింది. నెలరోజుల క్రితం సంగం డైరీ కేసులో ధూళిపాళ్లతో పాటు ఎండీ గోపాలకృష్ణను ఏసీబీ అరెస్ట్ చేసింది. వ్యక్తిగత పూచీకత్తుతో పాటు ఇద్దరు ష్యూరిటీలు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. 4 వారాల పాటు విజయవాడ కార్పొరేషన్‌ పరిధిలో ఉండాలని ధూళిపాళ్లను కోర్టు సూచించింది. విజయవాడలో ఉండే అడ్రస్‌ను దర్యాప్తు అధికారులకు ఇవ్వాలని, విచారణకు పిలవాలంటే 24 గంటల ముందు నోటీస్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Tags:    

Similar News