ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కేసుల ఎత్తివేత

Update: 2019-12-17 11:04 GMT

ఏపీ ప్రభుత్వం మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. పలు ఉద్యమాలలో పెట్టిన కేసులను ఎత్తివేస్తూ ఏపీ సర్కార్‌ ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 2016లో కాపు ఉద్యమంలో నమోదైన కేసులను ఎత్తివేసింది. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ భూసేకరణకు వ్యతిరేకంగా ఆందోళనపై నమోదైన కేసులు, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మరణం తర్వాత రిలయన్స్‌ ఆస్తుల ధ్వంసంలో నమోదైన కేసుల ఎత్తివేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి కేఆర్‌ఎం కిశోర్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 

Full View

Tags:    

Similar News