మందాకినిపై మోడీకి జగన్ లేఖ

Update: 2019-11-05 10:55 GMT

ఒడిషాలోని మందాకిని బొగ్గు క్షేత్రాన్ని ఏపీకి కేటాయించాలంటూ ప్రధాని మోడీకి సీఎం జగన్ లేఖ రాశారు. ఏపీలో 5100 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఉన్నాయన్న జగన్మోహన్ రెడ్డి అందుకు అవసరమైన బొగ్గు కోసం ఇబ్బందులు పడుతున్నట్లు ప్రధానికి ఆ లేఖలో వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో సింగరేణి నుంచి బొగ్గు సరఫరా జరిగేదని కానీ రాష్ట్ర విభజన తర్వాత ఏపీ వాటా ఇవ్వడం లేదన్నారు. దాంతో, ఇతర రాష్ట్రాల బొగ్గు మీదే ఏపీ ఆధారపడాల్సి వస్తోందన్న జగన్‌ ఛత్తీస్‌గఢ్‌, ఒడిషా నుంచి ఏటా 50 ఎంఎంటీఏల బొగ్గు కేటాయించాలని మోడీకి విజ్ఞప్తి చేశారు. 

Tags:    

Similar News