తెలంగాణలో తహశీల్దార్ దారుణహత్యతో ఆంధ్రప్రదేశ్ ఎమ్మార్వోలు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ తహశీల్దార్ తన ఛాంబర్ కు పది అడుగుల దూరంలో తాడు కట్టారు. తన ఆఫీసులోకి నేరుగా పిటిషర్లు రాకుండా ఎంట్రెన్ వద్ద అటెండర్ చెక్ చేసిన తర్వాత ఒక్కొక్కరిగా లోపలికి అనుమతిస్తున్నారు. కొందరు చిన్న విషయాలకే వాగ్వాదం చేస్తుండడంతో జాగ్రత్తలు తీసుకుంటున్నామని పత్తికొండ తహీశ్దీలార్ తెలిపారు.