స్పీకర్ తమ్మినేని సీతారాంపై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో శాసనసభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. స్పీకర్ ను వేలు పెట్టి చూపిస్తూ, విమర్శించడం దారుణమని అన్నారు అంబటి రాంబాబు. స్పీకర్ స్థానాన్ని అగౌరవపరిచిన ప్రతిపక్ష నేత చంద్రబాబుపై సభలో చర్చ జరగాలని, సభలో మర్యాద పాటించని వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సభ నుంచి చంద్రబాబును సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.