Dhulipalla Narendra: రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు

Dhulipalla Narendra:టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ అధికారులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.

Update: 2021-05-12 11:17 GMT
ధూళిపాళ్ల నరేంద్ర (ఫైల్ ఇమేజ్)

Dhulipalla Narendra: సంగం డెయిరీలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై అరెస్టయిన టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ అధికారులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. కరోనా సోకడంతో ఇప్పటి వరకు విజయవాడలోని ఆయుష్‌ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందారు. తాజాగా నరేంద్రకు కరోనా నెగటివ్‌ రావడంతో తిరిగి తీసుకెళ్లారు. తొలుత అరెస్ట్‌ చేసిన అనంతరం రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలోనే ఆయన్ను ఉంచారు. అయితే అక్కడ నరేంద్రకు కరోనా సోకడంతో విజయవాడలోని ఆయుష్‌ ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఇప్పుడు కోలుకోవడంతో మళ్లీ తీసుకెళ్లారు. వారం రోజుల పాటు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాలని వైద్యులు సూచించారు. అయితే జైల్లోనే ప్రత్యేక ఐసోలేషన్‌లో ఉంచుతామని ఏసీబీ అధికారులు తెలిపారు.

Tags:    

Similar News