Hyderabad: మందుబాబులకు అలర్ట్.. రేపు హైదరాబాద్లో వైన్ షాపులు బంద్!
Hyderabad: హైదరాబాద్ నగరంలోని మద్యం ప్రియులకు తెలంగాణ ప్రభుత్వం మరియు పోలీస్ శాఖ షాకింగ్ న్యూస్ చెప్పింది.
Hyderabad: మందుబాబులకు అలర్ట్.. రేపు హైదరాబాద్లో వైన్ షాపులు బంద్!
Hyderabad: హైదరాబాద్ నగరంలోని మద్యం ప్రియులకు తెలంగాణ ప్రభుత్వం మరియు పోలీస్ శాఖ షాకింగ్ న్యూస్ చెప్పింది. రేపు (మార్చి 27, శుక్రవారం) శ్రీరామనవమి పండుగను పురస్కరించుకుని జంటనగరాల పరిధిలో మద్యం దుకాణాలను మూసివేయాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు.
నగరవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూసేందుకు పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మార్చి 27వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి. వైన్ షాపులు, బార్లు, కల్లు దుకాణాలతో పాటు స్టార్ హోటళ్లలోని బార్లలో కూడా మద్యం విక్రయాలను నిలిపివేయాలని స్పష్టం చేశారు.
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఈ 'డ్రై డే' నోటిఫికేషన్ విడుదల చేసినట్లు సీపీ తెలిపారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు జరిపినా లేదా షాపులు తెరిచినా వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వైన్ షాపుల వద్ద బారులు తీరిన మందుబాబులు
రేపు రోజంతా మద్యం దుకాణాలు బంద్ ఉంటాయని తెలియడంతో నగరంలోని మద్యం ప్రియులు వైన్ షాపుల వద్దకు పరుగులు తీస్తున్నారు. రేపటి కోటాను కూడా ఈరోజే కొనుగోలు చేసేందుకు సిద్ధపడటంతో వైన్ షాపుల వద్ద సందడి నెలకొంది.