సంగారెడ్డిలో యువకుడి హల్చల్.. ట్రాఫిక్ పోలీసులు ఫొటో తీశారని ఒంటికి నిప్పు
Sangareddy: స్థానికులు మంటలు ఆర్పడంతో తప్పిన ముప్పు
సంగారెడ్డిలో యువకుడి హల్చల్.. ట్రాఫిక్ పోలీసులు ఫొటో తీశారని ఒంటికి నిప్పు
Sangareddy: సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద యువకుడు హాల్చల్ చేశాడు. బైక్పై వెళ్తున్న యువకుడి ఫొటోను ట్రాఫిక్ పోలీసులు తీశారు. దీంతో ఫొటో ఎందుకు తీశారని పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. యువకుని ఫోన్ లాక్కోవడంతో బైక్లో ఉన్న పెట్రోల్ తీసుకుని ఒంటికి నిప్పంటించుకున్నాడు. పక్కన ఉన్న వారు స్పందించి నిప్పు ఆర్పడంతో ప్రమాదం తప్పింది. యువకుడికి గాయాలు కాగా... ఆసుపత్రికి తరలించారు.